ప్రజలందరినీ సతమతం చేస్తోంది ఈ కరోనా. ఈ కరోనా వల్ల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. కాస్త వ్యాపారమో లేక బాగా సంపాదించిన వాళ్ళ పరిస్థితి కాస్త నయమే. కానీ రోజు వారి కూలీల స్థితి తలచుకుంటేనే ఘోరం అనిపిస్తోంది. అయితే మరి దీని నుండి బయట పడాలంటే ఆ మహమ్మారిని తరిమి కొట్టక తప్పదు. అప్పటి వరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని అనుసరించక తప్పదు.
ఇప్పుడు సినిమాలు లేవు, షూటింగ్స్ ఆగిపోయాయి. దీనితో ఆ చిత్ర పరిశ్రమలో పని చేసే జీతగాళ్ళకి, కూలీలకు పెద్ద చిక్కు వచ్చి పడింది.దీనితో వాళ్లకి సరిగ్గా డబ్బులు కూడా లేని దుస్థితి.కేవలం సినిమాల మీదే ఆధారపడి జీవిస్తున్న ఆ కూలీల బ్రతుకులు ఎంతో దారుణం. అయితే వీరిని దృష్టిలో పెట్టుకుని హీరో అజయ్ దేవగన్ సహాయం చేసాడు.
5 లక్షల మంది సినీ కార్మికులకు అజయ్ దేవగన్ పెడరెషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్ సంస్థకి ఏకంగా రూ. 51 లక్షలని విరాళంగా అందించాడు. ఈ సందర్భంగా FWICE అధికారి అశోక్ పండిట్ ట్వీట్ చేసాడు. ఇలా అజయ్ దేవగన్ సహాయం చెయ్యడం ఆనందంగా ఉంది అని అతను చెప్పాడు.
ఈ రియల్ లైఫ్ సింగానికి ధన్యవాదములు అని అతను అన్నారు. అజయ్ దేవగన్ 51 జన్మదినం జరుపుకున్నాడు. దర్శకుడు రాజమౌళి చిత్రిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో అజయ్ దేవగన్ కీలక పాత్ర పోషించనున్నాడు.
డిల్లీ క్రైం .. ఇదొక వెబ్ సిరీస్.. 2012 లో జరిగిన ఒక నిజమైన సంఘటణ ఆధారంగా ఈ టీవీ షో తెరకెక్కింది.. ఢిల్లీ క్రైం కధ, కధనం, యాక్టింగ్, కీ రోల్స్ పెర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్, స్క్రీన్ ప్లే ఒక్కటేమిటి అన్...
తొలి టాకీ ఆలం ఆరా.. అష్టకష్టాలు పడి పదింతల వినోదం పంచిన ఆర్దేషీర్ ఇరానీ.. సగటు మనిషికి అత్యంత వినోదాన్ని అందించేది సినిమా... జీవితంలోని కష్టాల&z...
0 Comments