ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఒలంపిక్ గేమ్స్ మరికొన్ని నెలలులో ప్రారంభం కానున్నాయి. చివరిగా బ్రెజిల్ దేశానికి చెందిన రియో డి జెనరలో 2016, ఆగస్టు 21 తేదీతో ముగిసిన ఒలింపిక్ గేమ్స్, మళ్ళీ నాలుగు ఏళ్ళు తరువాత జపాన్ లో మొదలు అవుతున్నాయి.
ఈ సారి ఒలింపిక్ గేమ్స్ కు జపాన్ ఆతిధ్యం వహించనుంది, 24 జూలై 2020 ప్రారంభంకానున్నా ఒలింపియాడ్ ఆగస్టు 9 వరుకు కొనసాగుతుంది అని ఒలింపిక్ అధికారికంగా తెలిపింది.
వరుసగా ఇది 32 వ ఒలింపియాడ్.
2016 బ్రెజిల్ లో నిర్వహించిన ఒలంపిక్ గేమ్స్ కు ఆ దేశ రాజధాని రియో పేరుని చేర్చి " 2016 రియో ఒలింపిక్ గేమ్స్ " అని పేరు పెట్టారు.
ప్రస్తుతం జపాన్ లో జరగనున్న 32 వ ఒలింపియాడ్ కి " 2020 టోక్యో ఒలింపిక్ గేమ్స్ " అని నామకరణం చేసారు. 1964 సంవత్సరంలో ఒలింపిక్ కమిటీ 18 వ ఒలంపిక్ గేమ్స్ ని టోక్యోలో జరిపింది.
దాదాపు 56 సంవత్సరాలు తరువాత మళ్ళీ జపాన్ లోని అదే టోక్యోలో మరో ఒలింపియాడ్ జరగనుంది.
ఆసియా ఖండంలో రెండోసారి సుమ్మనీర్ ఒలింపిక్ గేమ్స్ ని నిర్వహిస్తున్న ఏకైక దేశం "జపాన్" మాత్రమే ".
అది మాత్రమే కాదు దీనికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఆసియాలో మొదటి ఒలంపిక్స్ జరిగిన ఏకైక దేశం జపాన్ మాత్రమే. 1964 జపాన్ దేశంలో మొదలైన ఈ ఒలింపియాడ్ నుండే లైవ్ టెలికాస్ట్ చేయడం మొదలు అయ్యింది. ఇదే ఏడాది ఒలింపిక్స్ లో అధికారులు పూర్తిగా కంప్యూటర్లను వినియోగించడం ప్రారంభిచారు. అయితే సపోరో లో జరిగిన 1972 వింటర్ ఒలింపిక్ గేమ్స్ మరియు నాగానోలో జరిగిన 1998 వింటర్ ఒలింపిక్ గేమ్ ని కలుపుకుంటే జపాన్ ఒలింపిక్ గేమ్స్ ని నిర్వహించడం ఇది 4గవసారి.
ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, జపాన్ కు సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ నిర్వహించే అవకాశం రావడం ఇది 3 వ సారి .1940 సమ్మర్ ఒలింపిక్స్ నిర్వహించే అవకాశం వచ్చినప్పటికీ రెండో ప్రపంచ యుద్ధం కారణంగా జపాన్ ఒలింపియాడ్ ని నిర్వహించలేక పోయింది.
2020 ఒలంపిక్ గేమ్స్ ప్రత్యేకతలు :
ఏ) కరాటే బి) స్పోర్ట్ క్లైంబింగ్ సి) స్కేట్ బోర్డింగ్ సి) బేస్ బాల్ / సాఫ్ట్బాల్
2020 ఒలంపిక్ గేమ్స్ వేదికల్లో ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయో మీకు తెలుసా ?
1.టోక్యోలో 1964 న నేషన్ స్టేడియంలో సమ్మర్ ఒలింపిక్స్ జరిగాయి. ఇప్పుడు జరిగే ఒలంపిక్ గేమ్స్ కూడా అదే స్టేడియంలో జరుగానున్నాయి. దీనితోపాటు మరో 40 వేదికలలో ఈ గేమ్స్ జరగనున్నాయి. ఓలంపిక్స్ జరగడానికి ముందు ఈ స్టేడియంలో 2019 రగ్బీ వరల్డ్ కప్ జరగనుంది.
2. టోక్యో ఆర్గనైజింగ్ కమిటీ, ఒలింపిక్స్ చరిత్రలోనే మొదటి సారిగా ప్రజల కు భాగస్వామ్యంతో 2020 టోక్యో ఒలింపిక్స్ ని నిర్వహిస్తుంది.
3. టోక్యో ప్రపంచ పర్యావరణ పరిరక్షణ ఉదేశ్యంతో సరికొత్త మార్పులకు శ్రీకారం చూట్టింది. ఒలంపిక్ గేమ్స్ విజేతలికి ఇచ్చే మెడల్స్ ను ప్రజల దగ్గర వృదాగ పడివున్న వేస్ట్ ఎలక్ట్రానిక్ వస్తువులతో తయారు చేశారు. దేశంలో అనవసరంగా పేరుకు పోయిన 8 టన్నుల వృదా మొబైల్ ఫోన్స్ లాంటి వేస్ట్ ఎలక్ట్రానిక్ వస్తువులను ప్రజల నుండి సేకరించారు. వీటి కోసం ప్రత్యేకమైన వ్యవస్థని జపాన్ ప్రభుత్వం రూపొందించింద. వివిధ నగరాల్లో, రద్దీ ప్రదేశాల్లో జపాన్ ఖాళీ బాక్స్ లని నెలకొల్పారు. ఇందలో వృధాగా పడివున్న వస్తువలుని ప్రజలు అందులో వేయవచ్చు. ఈ వస్తువులను రీసైక్లింగ్ చేసి విజేతలికి ఇవ్వనుంది. జపాన్ ఈ వృదా వస్తువులతో 5000 మెడల్స్ ను తయారు చేస్తున్నాం అని తెలిపింది.
4. ఈ మెడల్స్ డిసైన్స్ కోసం జపాన్ ప్రజలకు పోటీలు కూడా నిర్వహించారు. ఈ విదంగా ప్రజల కు భాగస్వామ్యం కలిపించిన మొదటి ఒలంపిక్స్ గేమ్స్ గా నిలిచింది.
5. ఈ క్రీడా సంబరం లో 33 విభిన్న క్రీడలలో 339 ఈవెంట్లు 50 విభాగాలు ఉంటాయి.2020 జరిగే ఈవెంట్స్ లో కొత్తగా 15 ఈవెంట్స్ ని చేర్చారు.
2020 ఒలంపిక్ గేమ్స్ పై భారత్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. 2016 రియో ఒలంపిక్స్ లో విజేతలు గా నిల్చిన పివి.సింధు, కాంస్య పతక విజేత సాక్షీ మాలిక్, జిమ్నాస్టిక్లో అద్బుత ప్రతిభ కనబర్చిన దీపా కర్మాకర్ వంటి క్రీడాకారులు ఈ సారి అయినా భారత్ కి గోల్డ్ మెడల్ తీసికువస్తారు అని భారతీయులు ఆశిస్తున్నారు.
2020 టోక్యో ఒలంపిక్స్ విజేతలు ఎవరో తెలియాలి అంటే ఆగస్టు వరుకు వేచి చూడాల్సిందే.
మరుగున పడిన ఆటలు ఆడండి... ఆడించండి.. ఉల్లాసం... ఉత్సాహం... సామర్థ్యం.. ఆటలు శారీరక, మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయి. చక్కగా ఆడుకునే పిల్లలు సమగ్రంగా వ...
పుల్లెల గోపీ చంద్ ..భారత బ్యాడ్మింటన్ ఆటలో మొనగాడు. ఆడటమే కాదు ఆడించడం కూడా తెలుసు.. అందుకే పీవీ సింధుని ఒలింపిక్స్ స్వర్ణం దాకా తీసుకెళ్ళి తన సత్తా ప్రపంచానికి చాటాడు.. ఈసారి పోటీల్లో స్వర్ణమే లక్ష్య...
0 Comments