ఈ లాక్ డౌన్ వల్ల పనులు అన్ని మానుకుని ఈ మహమ్మారిని కట్టడి చెయ్యాలని ప్రతీ ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మహమ్మారి బారిన పడకుండా అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ కరోనా వల్ల ఇప్పటికే తీవ్ర దుస్థితి చోటు చేసుకుంది.
ప్రతీ ఒక్కరు కూడా ఈ కరోనా ని తరిమి కొట్టాలని శక్తి కొలది సాయం అందిస్తున్నారు.కరోనా భీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి అందర్నీ ఇబ్బంది పెడుతోంది. వారు వీరు అన్నది లేకుండా అందర్నీ కూడా ఈ మహమ్మారి అనేక బాధలు పెడుతోంది.
లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే అన్ని పాఠశాలలు, విద్య విద్యా సంస్థలు కూడా సెలవులు ప్రకటించింది. ఈ కరోనా తీవ్రత వల్ల పాఠశాల లో కూడా పరీక్షలు నిర్వహించకుండా మూసి వేయడం జరిగింది. అయితే రాష్ట్రం లో అన్ని యాజమాన్యాల పరిధిలో ఉన్న పాఠశాలలకు జూన్ 11వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు.
సాధారణంగా ప్రతి సంవత్సరం క్యాలెండర్ ప్రకారం జూన్ 11 వరకు వేసవి సెలవులు అన్నది తెలిసినదే. ఈ విషయాన్ని పాఠశాల విద్యా శాఖ అధికారికంగా ప్రకటించింది. అయితే ఆ తేదీ తర్వాత మాత్రమే పాఠశాల తెరుచుకోవాలని అంటున్నారు.
అయితే అప్పుడు పరిశీలించి కరోనా తీవ్రతను బట్టి ఆలోచించాలి అని చెప్పి అంటున్నారు. కోవిద్ 19 పరిస్థితిని అనుసరించి ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం పాఠశాలలు తిరిగి ఎప్పుడు తెరుచుకోవాలి అన్నది నిర్ణయిస్తారని చెప్పారు.
ఇలా నిర్ణయించిన తర్వాత ప్రకటిస్తామని విద్యా శాఖ జాయింట్ డైరెక్టర్ బి. ప్రతాప రెడ్డి శుక్రవారం నాడు ఉత్తర్వులను జారీ చేశారు. కోవిద్ 19 పరిస్థితి బట్టి రీ ఓపెనింగ్ తేదీ ప్రకటిస్తారట.
ఏం పిల్లడో ఎల్దమొస్తవా..... ఉత్తరాంధ్ర గద్దర్ "వంగపండు".. ఆయన ప్రముఖ వాగ్గేయకారుడు, గాయకుడు, జననాట్యమండలి వ్యవస్థాపక అధ్యక్షుడు... ఏం పిల్ల&zwnj...
యువతకు బాసటగా నిలిచిన మన్నెం మధుసూదన్ రావు.. కొంతమంది జీవితాలు సినిమా స్టోరీకి ఏ మాత్రం తీసిపోవు. ఇతని కథ కూడా అలాంటిదే. కటిక పేదరికంలో పుట్టాడు. కాలే కడుపుతో కష్టాలు అనుభవిస్తూ పెరిగాడు. పేదరికాన్ని...
0 Comments