అయితే ఇప్పటి వరకు విజయనగరంలో జీరో కేసుల ఉండగా. తాజాగా కేసులు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో కరోనా వల్ల తొలి మరణం సంభవించింది. బలిజిపేట మండలం చిలకలపల్లి గ్రామానికి చెందిన వృద్ధురాలు కరోనా లక్షణాల తో చికిత్స పొందుతూ కన్నుమూసిన ఆమె కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ విశాఖపట్నం కేజీహెచ్ నుండి టీబీ ఆస్పత్రికి వెళ్లారు.
పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు జిల్లాగా కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహర్లాల్ వెల్లడించారు. రెండు రోజుల క్రితం ఆమె మరణం తో ఒక్క సారిగా విజయనగరం జిల్లా ఉలిక్కిపడింది.
అయితే ఆమెకి 51 మంది నేరుగా అంతే కాకుండా 21 మందితో పరోక్ష సంబంధాన్ని కలిగి ఉన్నట్లు అధికారులు తేల్చారు. అయితే వీరందరినీ క్వారంటైన్ సెంటర్ కు తరలించారు. అయితే శనివారం నాటికి మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరికి విమ్స్ హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు.
అయితే జిల్లాలో నిబంధనలు మరింత కఠినంగా చేయాలని అధికారులు నిర్ణయించారు అయితే ఇప్పుడు ఆదివారం నుంచి జిల్లాలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకే దుకాణం తెరవడానికి అనుమతిచ్చారు కలెక్టర్.
అలానే కూరగాయలు విక్రయిస్తున్న వ్యాపారులు అందరికీ కూడా పరీక్షలు చేయాలని అధికారులు సూచించారు అలానే కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పారిశుద్ధ్య రెవెన్యూ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సిబ్బంది చర్యలు అందిస్తున్నారు
ఏం పిల్లడో ఎల్దమొస్తవా..... ఉత్తరాంధ్ర గద్దర్ "వంగపండు".. ఆయన ప్రముఖ వాగ్గేయకారుడు, గాయకుడు, జననాట్యమండలి వ్యవస్థాపక అధ్యక్షుడు... ఏం పిల్ల&zwnj...
యువతకు బాసటగా నిలిచిన మన్నెం మధుసూదన్ రావు.. కొంతమంది జీవితాలు సినిమా స్టోరీకి ఏ మాత్రం తీసిపోవు. ఇతని కథ కూడా అలాంటిదే. కటిక పేదరికంలో పుట్టాడు. కాలే కడుపుతో కష్టాలు అనుభవిస్తూ పెరిగాడు. పేదరికాన్ని...
0 Comments