అది భారతదేశంలో గల ప్రముఖ వైష్ణవ క్షేత్రాలలో ముఖ్యమైనది. ప్రపంచ ప్రఖ్యాత దివ్యధామం పౌరాణిక మరియు చారిత్రక ప్రాధాన్యం కల పుణ్యక్షేత్రం. చార్ధామ్లలో అత్యంత ప్రధానమైనది అదే... ఒడిశాలోని పూరీ జగన్నాథుని దివ్య క్షేత్రం. ఇక్కడ శ్రీమహావిష్ణువు జగన్నాథుడి రూపంలో సోదరుడు బలభద్ర, సోదరి సుభద్రలతో కలసి కొలువు తీరి ఉన్నారు. ఈ దేవాలయంలోని మూల విరాట్ నుండి ప్రసాదం వరకు అంతా విశిష్టమే. ఈ దేవాలయంలో విగ్రహాలు చెక్కతో తీర్చిదిద్దారు. ఇవే విగ్రహాలు ఉత్సవమూర్తులుగా ఊరేగింపునందుకుంటాయి. ప్రసాదంగా ఇచ్చే అన్నం, పప్పు మొదలైనవి కుండలలో వండుతారు. ఇతర దేవాలయాలలో మాదిరిగా స్వామి తన దేవేరులతో కొలువై ఉండక, సోదరుడు బలభద్ర, సోదరి సుభద్రతో కొలువై ఉంటారు. అందుకే ఈ ఆలయం సోదర ప్రేమకు ప్రతీకగా కీర్తి పొందింది.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...