అసలేంటి ఈ “మహిళా ఉద్యమ్ నిధి” ? “మహిళా ఉద్యమ్ నిధి” పధకం ద్వారా కేంద్రం, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నిర్వహించాలనుకునే మహిళలకు 10 లక్షల వరకు ఆర్థిక సహకారం అందించనుంది. స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI) ఈ పథకాన్ని అందిస్తోంది. ఈ పధకం కేవలం ఉమెన్ ఎంట్రప్రెన్యూర్లకు మాత్రమే వర్తిస్తుంది. అంటే వ్యాపారం చేయాలని భావించే మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకోవచ్చు. ఇందులో భాగంగా బ్యాంకులు అర్హులైన మహిళలకు ఆకర్షణీయ వడ్డీ రేటుకే రుణాలు అందిస్తున్నాయి. ఉమెన్ ఎంటర్ప్రైజ్ ఫండ్ ద్వారా ఈ లోన్స్ పొందొచ్చు. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలిసిన విషయం ఏమిటంటే ? మీరు తీసుకునే రుణాల వడ్డీ రేటును నిర్ణయించే అధికారం పూర్తిగా బ్యాంకులకే ఉంటుంది. ఇప్పటికే బిజినెస్ చేస్తున్న మహిళలు దాని కార్యకలాపాల విస్తరణకు కూడా రుణం తీసుకోవచ్చు. తీసుకున్న రుణాన్ని ఐదేళ్ల వరకు చెల్లించవలసిన అవసరం లేదు. ఈ ఐదేళ్లలో లోన్ రీపేమెంట్ కు మారటోరియం ఉంటుంది. ఆ తరువాత లోన్ తీసుకున్న పదేళ్లలోపు రుణం చెల్లిస్తే సరిపోతుంది. మార్కెట్ రేట్ని బట్టి వడ్డీ రేటును “స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా” నిర్ణయిస్తుంది. తీసుకున్న లోన్పై ప్రతి ఏటా 1 శాతం సర్వీస్ ఛార్జీ చెల్లించాలి. రుణాలు తీసుకున్న సమయంలో ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...