'/> ' > '> '>
అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది అని అంటారు. ఎందుకంటే? ఆకలికి కులమత బేధాలు లేవు, ధనిక, పేదల తేడాలు లేవు. అందరినీ సమానంగా బాధించేది ఆకలి బాధ. ధనం ఉండి కూడా ఆకలి బాధ బారినుండి తప్పించుకోలేం, ఒక్కొక్కసారి. అటువంటి ఆకలి బాధితులను ఆపన్న సమయంలో ఆదుకున్న మహిళా డొక్కా సీతమ్మ. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలకు డొక్కా సీతమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆకలి అన్నవారికి కడుపునిండా అన్నంపెట్టిన నిత్యాన్నదాత ఆమె. ఖండాంతర ఖ్యాతి గడించిన మహాతల్లి. డొక్కా సీతమ్మ తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రాపురం తాలుకా , మండపేట గ్రామంలో 1841, అక్టోబరు రెండోవారంలో జన్మించారు. ఈమె తండ్రి భవానీ శంకరం, తల్లి నరసమ్మ. సీతమ్మ తండ్రి శంకరం గారిని గ్రామస్తులు 'బువ్వన్న' గారనే పేరుతో పిలుస్తుండేవారు. దానికి కారణం ఆయన అడిగిన వారందరికీ అన్నం పెట్టటమే! అటువంటి తండ్రికి కూతురిగా జన్మించిన సీతమ్మ అన్నార్తుల ఆకలిని తీర్చిన మహా ఇల్లాలు. విద్యావాసనలు లేని సాధారణ గృహిణి ఆమె. మిగిలిన అంశాలు వీడియోలో తెలుసుకుందాం..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...